ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆహుతైన 1500 గుడిసెలు..!

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుగ్లకాబాద్‌ మురికివాడలో సోమవారం అర్ధరాత్రి గం.12.50ని.ల సమయంలో ఈ ప్రమాదం జరగ్గా

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆహుతైన 1500 గుడిసెలు..!
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 11:14 AM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుగ్లకాబాద్‌ మురికివాడలో సోమవారం అర్ధరాత్రి గం.12.50ని.ల సమయంలో ఈ ప్రమాదం జరగ్గా.. సుమారు రెండు ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఇందులో దాదాపు 15వందల వరకు గుడిసెలు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినట్లు సోమవారం రాత్రి ఒంటిగంటకు తమకు సమాచారం అందిందని డీసీపీ రాజేంద్రప్రసాద్ మీనా తెలిపారు.

Read This Story Also: నేడు ఏపీలో తేలికపాటి వర్షాలు..!