మారుతి సుజుకి సీఈవోగా మళ్లీ కెనిచి

ముంబై:  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2013 మార్చిలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి  కెనిచి మారుతికి పలు విలువైన సేవలు అందించారు. కంపెనీ షేర్ వాల్యూ ఉన్నతికి […]

మారుతి సుజుకి సీఈవోగా మళ్లీ కెనిచి
Follow us

|

Updated on: Mar 28, 2019 | 11:31 AM

ముంబై:  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2013 మార్చిలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి  కెనిచి మారుతికి పలు విలువైన సేవలు అందించారు. కంపెనీ షేర్ వాల్యూ ఉన్నతికి పాటు పడటంతో పాటు..ఇబ్బందికరంగా మారిన లేబర్ గొడవలు కూడా సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ఆయన హాయంలో వచ్చిన పలు విజయవంతమైన కొత్త మోడళ్ల కార్లు కూడా కష్టమర్ల అభిమానాన్ని చూరగొన్నాయి. కెనిచి నియామకం 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని బోర్డు తెలిపింది.  తాజాగా అవకాశంతో మూడోసారి కూడా  మరో మూడేళ్ల పాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు.