బై నౌ- పే లేటర్..! మారుతి బంపర్ ఆఫర్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కార్ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కార్ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది. ఎం అండ్ ఎం తరహాలో ‘బై నౌ- పే లేటర్ ఆఫర్’ ని ప్రవేశపెట్టింది. ఇందుకుగాను మారుతి సుజుకి సంస్థ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. దీంతో కారు కొన్నవారు 2 నెలల తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు. 2 నెలల వరకు ఈఎంఐ డిఫర్మెంట్ లభిస్తుంది. సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా మారుతి సుజుకి తెలిపింది.
కరోనా లాక్డౌన్ సమయంలో లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్నవారిని టార్గెట్ చేసుకుని ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లుగా మారుతి సుజికి వెల్లడించింది. కొనుగోలుదారులపై వెంటనే అదనపు ఒత్తిడిలేకుండా.. వినియోగదారులను కొనుగోలు వైపుగా ఈ ఆఫర్ ఆకర్షిస్తుందని ప్రకటించింది. కేవలం ఎంపిక చేసిన మారుతి సుజుకి కారు మోడల్స్పైనే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి సుజుకి ఔట్లెట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని ఆ సంస్థ తెలియజేసింది. ఈ ఆఫర్ జూన్ 30తో ముగుస్తుందని వెల్లడించింది.