హైదరాబాద్లో దారుణం.. ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్లో దారుణం జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి శ్రీవిద్య (27) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
Married Woman Suicide: హైదరాబాద్లో దారుణం జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి శ్రీవిద్య (27) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్కి చెందిన శ్రీవిద్యకు వరంగల్కి చెందిన శబరీష్తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. పని నిమిత్తం శబరీష్ బెంగళూరుకు వెళ్లడంతో.. చందానగర్లోని అతడి కుటుంబ సభ్యుల ఇంటికి శ్రీవిద్య వెళ్లింది.
ఇక శనివారం మధ్యాహ్నం భర్త శబరీష్తో ఫోన్లో మాట్లాడుతుండగా.. వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో భవనం నుంచి దూకి శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. గాయాలపాలైన శ్రీవిద్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవిద్య మరణించింది. కాగా భర్త శబరీష్ వేధింపులే శ్రీవిద్య ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం శ్రీవిద్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Read More: