మావోయిస్టుల విధ్వంసం…మూడు వాహనాలకు నిప్పు…

మహారాష్ట్రాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. గడ్చిరోలి జిల్లాలోని ధనోరాలో మూడు ట్రక్కులను తగలబెట్టారు. గ్రామాలకు బీటీ రోడ్లను వేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు.

మావోయిస్టుల విధ్వంసం...మూడు వాహనాలకు నిప్పు...
Follow us

| Edited By:

Updated on: May 20, 2020 | 3:28 PM

Maoists torch four vehicles: మహారాష్ట్రాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. గడ్చిరోలి జిల్లాలోని ధనోరాలో మూడు ట్రక్కులను తగలబెట్టారు. గ్రామాలకు బీటీ రోడ్లను వేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇవి మావోయిస్టులకు పట్టున్న గ్రామాలు కావటంతో వారికి కంటగింపుగా మారింది. దీంతో పనులు నిర్వహిస్తున్న ట్రక్కులను అర్ధరాత్రి సమయంలో కాల్చేశారు. కరోనా సంక్షోభం సమయంలో మావోయిస్టులు దాడులకు పాల్పడరన్న ధీమాతో ప్రభుత్వం అభివృద్ధి పనుకుల శ్రీకారం చుట్టింది. అయితే పనులు మొదలైన వారం రోజులకే మావోయిస్టులు దాడులకు తెగబడటంతో కాంట్రాక్టర్లు, కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఏరియాలో మావోయిస్టులకు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Also Read: ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..