ఫైజర్ వ్యాక్సిన్ కోసం బ్రిటన్ ప్రయాణానికి భారతీయుల ఆసక్తి,, అప్పుడే ట్రావెల్ ఏజంట్లు బిజీ బిజీ !

కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం బ్రిటన్ వెళ్లేందుకు అప్పుడే భారతీయులు తహతహలాడుతున్నారు. ఈ టీకామందును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో చాలామంది ఇండియన్స్ నుంచి  తమకు కాల్స్ అందడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ కోసం బ్రిటన్ ప్రయాణానికి భారతీయుల ఆసక్తి,, అప్పుడే ట్రావెల్ ఏజంట్లు బిజీ బిజీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2020 | 7:42 PM

కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం బ్రిటన్ వెళ్లేందుకు అప్పుడే భారతీయులు తహతహలాడుతున్నారు. ఈ టీకామందును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో చాలామంది ఇండియన్స్ నుంచి  తమకు కాల్స్ అందడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు. వచ్ఛే వారం నుంచి ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో లండన్ వెళ్లే ఇక్కడివారికోసం ఓ ట్రావెల్ ఏజెంట్ మూడు రాత్రుల ప్యాకేజీని రెడీ చేయాలనీ యోచిస్తున్నాడట. ఈ నెల 15 నుంచి తమ దేశంలో అడుగు పెట్టే ప్రతి విదేశీయుడూ 5 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని, ఆరో రోజున ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని బ్రిటన్ నిబంధన విధించింది.

అయితే ఆ దేశం నుంచి అధికారికంగా తమకు ఇంకా సమాచారం  లభించాల్సి ఉందని కొందరు ట్రావెల్ ఏజంట్లు చెప్పారు. భారతీయ పాస్ పోర్టు హోల్డర్లు అక్కడ వ్యాక్సినేషన్  చేయించుకోవడానికి అర్హుల కారా అన్నది ఇంకా నిర్ధారణ కావలసి ఉందనని ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈఓ నిషాంత్ అన్నారు. విమాన టికెట్ల రేట్ల విషయమై వివిధ ఎయిర్ లైన్స్ ని సంప్రదిస్తున్నామని, అలాగే లండన్ హోటళ్లతో, అక్కడి ఆసుపత్రులతో టచ్ లో ఉంటున్నామని ఆయన వెల్లడించారు.

క్వారంటైన్ లేకుండా లండన్ కు షార్ట్ ట్రిప్ ఏదైనా ఉందా అని కొంతమంది వాకబు చేసినట్టు బెంగుళూరు లోని ఓ ట్రావెల్ కంపెనీ తెలిపింది. అసలు ఈ ఫైజర్  వ్యాక్సిన్ ఎలా ఉంటుందని, వేచి చూద్దామని చాలామంది  భావిస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా అని కొందరు భయపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ట్రావెల్ ఏజెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి.