భారత్, కివీస్ మ్యాచ్కు వరుణుడి అడ్డంకి.?
మాంచెస్టర్: ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఆతిధ్య ఇంగ్లాండ్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు గురువారం రెండో సెమీస్లో తలబడనుండగా.. భారత్, కివీస్ మంగళవారం మొదటి సెమీస్లో తలబడతాయి. ఇది ఇలా ఉండగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని క్రికెట్ అభిమానులు సంకోచిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్కప్లోని […]
మాంచెస్టర్: ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఆతిధ్య ఇంగ్లాండ్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు గురువారం రెండో సెమీస్లో తలబడనుండగా.. భారత్, కివీస్ మంగళవారం మొదటి సెమీస్లో తలబడతాయి. ఇది ఇలా ఉండగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని క్రికెట్ అభిమానులు సంకోచిస్తున్నారు.
ఇప్పటికే వరల్డ్కప్లోని పలు లీగ్ మ్యాచ్లకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో నాటింగ్హమ్ వేదికగా జరగాల్సిన భారత్, కివీస్ల మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించిన విషయం తెలిసిందే.