పోలీస్ కేసు పెట్టిందని, భార్యను గొంతుకోసి చంపేశాడు
పోలీస్ కేసు పెట్టిందన్న కోపంతో కట్టుకున్న భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు ఓ కసాయి భర్త. కత్తితో కిరాతకంగా గొంతుకోసేశాడు.
పోలీస్ కేసు పెట్టిందన్న కోపంతో కట్టుకున్న భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు ఓ కసాయి భర్త. కత్తితో కిరాతకంగా గొంతుకోసేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాతబస్తీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్ ఖాజామొహిద్దీన్, అస్మా బేగం(35) దంపతులు షాలిబండ ఏరియాలోని ఖాజీబండ అలీనగర్ లో నివశిస్తున్నారు. తొమ్మిదేళ్ల కిందట వీరికి వివాహమైంది. ముగ్గురు పిల్లలతో కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త ఖాజామొహిద్దీన్ నిత్యం భార్యతో గొడవపడుతూ, వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఇటీవల వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో అస్మా భర్తపై పోలీసులకు ఫిర్యాదు చచేసింది. దంపతులిద్దర్నీ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. గొంతుకోసి కిరాతకంగా చంపేశాడు. కత్తిపోట్లకు గురైన అస్మా పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read :
ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్