Suicide in Adilabad: ఆర్మీ ఉద్యోగానికి పనికిరానని యువకుడి ఆత్మహత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..
Suicide in Adilabad: ఆర్మీ ఉద్యోగానికి తను పనికిరానని మనస్తాపం చెందిన ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన సంఘటన ఆదిలాబాద్
Suicide in Adilabad: ఆర్మీ ఉద్యోగానికి తను పనికిరానని మనస్తాపం చెందిన ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీర్కు చెందిన జిట్ట శంకర్,అనిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్ డిగ్రీ మధ్యలో చదువు ఆపేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇటీవల ఆర్మీ ఉద్యోగం కోసం అతని స్నేహితులు దరఖాస్తు చేసుకోగా అందుక్కావాల్సిన అర్హతల కోసం కరీంనగర్లో ఆర్మీ ఎంపికకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్కు ప్రవీణ్ ఫోన్ చేశాడు. వారు చెప్పిన శారీరక కొలతలు తనకు సరిపోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఉదయం వాకింగ్కు వెళ్తున్నానని చెప్పి వ్యవసాయ చేన్లోని చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తిరిగి రాకపోవడంతో తమ్ముడు ప్రశాంత్ తొమ్మిది గంటలకు చేన్లోకి వెళ్లగా చెట్టుకు వేలాడుతూ కన్పించాడు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.