జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య.. నలుగురు వచ్చి..!

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఘోరం జరిగింది. రాళ్లతో కొట్టి ఫయాజ్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు నలుగురు. బాల్‌నగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.

జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య.. నలుగురు వచ్చి..!
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 4:23 PM

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఘోరం జరిగింది. రాళ్లతో కొట్టి ఫయాజ్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు నలుగురు. బాల్‌నగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోన్న ఫయాజ్‌ షహీన్ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె జగద్గిరిగుట్టలో ఉండగా.. తరచుగా అక్కడికి వచ్చేవాడు. ఈ క్రమంలో తాజాగా జగద్గిరిగుట్టకు రాగా.. ప్రశాంత్, టిల్లు, సాయి, నరేష్ కలిసి అతడిని వెంటాడారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడకు వెళ్లిన ఆ నలుగురు ఫయాజ్‌ను రాళ్లతో కొట్టి చంపారు. నిందితులు పట్టుబడ్డారని.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

Read This Story Also: చెర్రీ పాత్రలో మార్పులు చేస్తోన్న కొరటాల..!