పనికి కుదుర్చుకొని బాలికపై ఆర్నెళ్లుగా అత్యాచారం
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం వెలుగు చూసింది. బెదిరింపులకు తెగబడి మైనర్ బాలికపై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ దుండగుడు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం వెలుగు చూసింది. బెదిరింపులకు తెగబడి మైనర్ బాలికపై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ దుండగుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్కు చెందిన యుగందర్ అనే వ్యక్తి తన వద్ద 15 సంవత్సరాలు ఉన్న బాలికను పనికి కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలికను బెదిరించి గత ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
ఇటీవల బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిందితుడు యుగందర్, అతడి భార్యపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read :
ఆరు వారాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ !