కాపురానికి రాని భార్య..ట్యాంక్ పైనుంచి దూకిన భర్త
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. యాదగిరి అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఇవాళ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకేశాడు. ఈ అనుకోని పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా… పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గు గ్రామానికి చెందిన బాలయ్య, ఆండాలు దంపతుల కుమారుడు యాదగిరి భార్య కొన్ని […]
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. యాదగిరి అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఇవాళ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకేశాడు. ఈ అనుకోని పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా… పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గు గ్రామానికి చెందిన బాలయ్య, ఆండాలు దంపతుల కుమారుడు యాదగిరి భార్య కొన్ని నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. నాటి నుంచి కాపురానికి రాకపోవడంతో యాదగిరి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెద్దలలో మాట్లాడించినా ఫలితం లేకపోవడంతో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివార్లలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.