బీర్ అనుకుని దాన్ని తాగేశాడు.. ప్రాణాలు కోల్పోయాడు..
కరోనా వైరస్ నియంత్రంణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం మద్యం షాపులు, బార్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే మద్యం ప్రియులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎక్కడ కూడా మద్యం దొరక్కపోవడంతో.. పలుచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. తాజాగా.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇక్కడ మృతుడు.. లిక్కర్లా కనిపిస్తుందని.. యాసిడ్ను తాగేశాడు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని […]
కరోనా వైరస్ నియంత్రంణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం మద్యం షాపులు, బార్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే మద్యం ప్రియులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎక్కడ కూడా మద్యం దొరక్కపోవడంతో.. పలుచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. తాజాగా.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇక్కడ మృతుడు.. లిక్కర్లా కనిపిస్తుందని.. యాసిడ్ను తాగేశాడు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని టీ.టీ నగర్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సురేశ్ సజాల్కర్ అనే యాభై ఏళ్ల వయస్సున్న వ్యక్తి.. బీర్ బాటిల్లో ఉన్న యాసిడ్ను బీర్ ఏమో అనుకుని.. గటగట తాగేశాడు. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. అయితే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ… రెండు రోజులుగా చికిత్స పొందుతూ.. బుధవారం ప్రాణాలు వదిలాడు. వైద్యులు అతన్ని బతికించే ప్రయత్నం ఎంత చేసినా ఫలించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.