చిరుత చర్మంతో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్..
ఛత్తీస్గఢ్లో ఓ వ్యక్తి చిరుత చర్మంతో పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం గరియాబంద్ జిల్లాలో చోటుచేసుకుంది. చిరుత చర్మంతో సంచరిస్తుండగా.. ఓ 55 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఛత్తీస్గఢ్లో ఓ వ్యక్తి చిరుత చర్మంతో సంచరిస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం గరియాబంద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ 55 ఏళ్ల వ్యక్తి.. చిరుత చర్మంతో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో.. పోలీసులు ఆయన్ను తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పేరు రామ్నాథ్ నేతంగా గుర్తించారు. నిందితుడిపై పోలీసులు వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇతడి వెనుక ఎవరైనా ముఠా ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
మరోవైపు ఇటీవల ఒడిషాలో కూడా రెండు చిరుతలను గుర్తించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన సిబ్బంది నయాగర్ ప్రాంతంలో రెండు చిరుతలను ఓ వ్యక్తి బంధించినట్లు గుర్తించారు. వాటిని బోనులో పెట్టి.. ఇంట్లోనే ఉంచుకున్నట్లు గుర్తించారు.