అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్న.. చంద్రయాన్ కాలంలో కూడా అనారిక చర్యలకు అంతూపోంతూ లేకుండా పోతోంది. చేతబడి, చిల్లంగి, బాణమతి పేరుతో సాటి మనుషుల్ని దారుణంగా చంపుతున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సభ్యసమాజం సిగ్గుపడే ఇటువంటి దారుణ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళితే డుంబ్రిగూడ మండలం పుట్టంబందకు చెందిన జయరాం అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామంలో కొంత కాలం నుంచి ప్రచారం సాగుతోంది. ఈ అనుమానంతో జయరాంపై గ్రామస్తులు నిఘాపెట్టారు. అయితే ఇటీవల గ్రామంలో కొన్ని మరణాలు సంభవించడం, కొంతమంది అనారోగ్యం పాలు కావడంతో గ్రామంలో జయరాంపై ఆగ్రహం పెంచుకున్నారు. వీటన్నిటీకీ కారణం ఇతడే అని, చేతబడి చేయడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు అనుమానించారు. ఈ నేపథ్యంలో బుధవారం జయరాంను పట్టుకుని కర్రలతో విచక్షణారహితంగా చావబాదారు. కొనఊపిరితో ఉన్న జయరాం ఎక్కడ బతికి మళ్లీ తమపై కక్ష పెంచుకుని చేతబడి చేస్తాడో అని భయపడి మూకుమ్మడిగా పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఈ సజీవ దహనానికి కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Breaking News
- ఏడు నెలల పాలనలో జగన్ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
- ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
- కృష్ణాజిల్లా: కీసర టోల్ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్ కౌంటర్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.
- చిత్తూరు టూటౌన్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్స్టేషన్ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
- చెన్నై వన్డేలో టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్. భారత్-విండీస్ మధ్య తొలివన్డే.
- తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
- విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.