విశాఖ జిల్లాలో దారుణం.. పశువుల పాకకు నిప్పంటుకుని ఓ వ్యక్తి సజీవదహనం

విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పశువుల పాకకు నిప్పంటుకుని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

విశాఖ జిల్లాలో దారుణం.. పశువుల పాకకు నిప్పంటుకుని ఓ వ్యక్తి సజీవదహనం
Follow us

|

Updated on: Nov 25, 2020 | 10:29 AM

విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పశువుల పాకకు నిప్పంటుకుని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మునగపాక మండలం గంటవానిపాలెంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గుర్రాల బెన్నయ్య(66) అనే రైతు గత రాత్రి పశువుల పాకలో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటున్నాయి.. దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పాకలో నిద్రిస్తున్న బెన్నయ్య మంటల్లో పడి సజీవదహనం అయ్యాడు. పశువుల పాక పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే బెన్నయ్య కాలిబూడిదయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.