నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరిస్తూ దీదీ ట్వీట్
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరిస్తూ ట్వీట్ చేశారు. 1945లో ఇదే రోజున ఆయన ఆచూకీ లేకుండా పోయిందంటూ ఉద్వేగభరి ట్వీట్ చేశారు. ఆయన ఈ భూమి పుత్రుడని..
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరిస్తూ ట్వీట్ చేశారు. 1945లో ఇదే రోజున ఆయన ఆచూకీ లేకుండా పోయిందంటూ ఉద్వేగభరి ట్వీట్ చేశారు. ఆయన ఈ భూమి పుత్రుడని పేర్కొన్నారు. తైవాన్లోని టైహోకు విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన తిరిగి రాలేదని.. అలానే కరుమరుగైపోయారన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనకు ఏమైందన్న విషయం తెలియదని.. నేతాజీ ఈ నేలకు చెందిన గొప్ప వీరుడంటూ పేర్కొంటూ.. ఆయన గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెందారని ప్రకటించినప్పటికీ.. ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళారంటూ అనేకమంది నమ్ముతారు.
On this day, in 1945, Netaji Subhas Chandra Bose went on a flight from Taihoku Airport in Taiwan, only to disappear forever. We still do not know what happened to him. People have a right to know about the great son of the soil
— Mamata Banerjee (@MamataOfficial) August 18, 2020
Read More :