Mamata Banerjee Comments : బీజేపీ పై మండిపడ్డ మమత.. దేశంలో పెద్ద జంక్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేసిన దీదీ

బీజేపీ కారణంగానే దేశంలో ఆహార కొరత మొదలైయిందని త్రుణముల కాంగ్రెస్ అదినేత్రి,పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి అన్నారు. రైతులు తీవ్రంగా నిరసిస్తూ ఆందోలన చేస్తుంటే..

Mamata Banerjee Comments : బీజేపీ పై మండిపడ్డ మమత.. దేశంలో పెద్ద జంక్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేసిన దీదీ
Follow us

|

Updated on: Jan 11, 2021 | 6:54 PM

Mamata Banerjee Comments : బీజేపీ కారణంగానే దేశంలో మొదలైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి అన్నారు. రైతులు తీవ్రంగా నిరసిస్తూ.. ఆందోళన చేస్తుంటే బీజేపీ మాత్రం మొండి వైఖరి మానడం లేదని ఆమె అన్నారు. సోమవారం నాదియా జిల్లాలో ఆమె ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

దేశంలో బీజేపీ పెద్ద జంక్ పార్టీగా మారిందంటూ వ్యాఖ్యలు చేసారు. అవినీతికి పాల్పడిన, కుళ్లిపోయిన నేతలను బీజేపీ చేర్చుకుంటుందని ఆమె ఎద్దేవా చేసారు. వ్యవసాయ చట్టలపై బీజేపీ మొండి వైఖరి వీడకుంటే దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని మమత అన్నారు. దేశానికి రైతులే ఆస్తి.. వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆమె అన్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sri Ketaki Sangameshwara Temple: శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం.. ఇక్కడ కుండంలో స్నానంచేస్తే చర్మ వ్యాధులు దూరం అంటూ నమ్మకం

16 గంటల్లో 13వేల 993 కిలోమీటర్ల ప్రయాణం, ఓన్లీ లేడీ పైలెట్స్, నాన్ స్టాప్ జర్నీ.. శాన్‌ఫ్రాన్సిస్కో టు బెంగళూరు