Mamata Banerjee Comments : బీజేపీ పై మండిపడ్డ మమత.. దేశంలో పెద్ద జంక్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేసిన దీదీ
బీజేపీ కారణంగానే దేశంలో ఆహార కొరత మొదలైయిందని త్రుణముల కాంగ్రెస్ అదినేత్రి,పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి అన్నారు. రైతులు తీవ్రంగా నిరసిస్తూ ఆందోలన చేస్తుంటే..
Mamata Banerjee Comments : బీజేపీ కారణంగానే దేశంలో మొదలైందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి అన్నారు. రైతులు తీవ్రంగా నిరసిస్తూ.. ఆందోళన చేస్తుంటే బీజేపీ మాత్రం మొండి వైఖరి మానడం లేదని ఆమె అన్నారు. సోమవారం నాదియా జిల్లాలో ఆమె ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
దేశంలో బీజేపీ పెద్ద జంక్ పార్టీగా మారిందంటూ వ్యాఖ్యలు చేసారు. అవినీతికి పాల్పడిన, కుళ్లిపోయిన నేతలను బీజేపీ చేర్చుకుంటుందని ఆమె ఎద్దేవా చేసారు. వ్యవసాయ చట్టలపై బీజేపీ మొండి వైఖరి వీడకుంటే దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని మమత అన్నారు. దేశానికి రైతులే ఆస్తి.. వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆమె అన్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :