క్లైమాక్స్కు చేరిన విజయ్ మాల్యా కథ
లిక్కర్ డాన్ విజయ్ మాల్యా కథ కంచికి చేరింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన విజయ్మాల్యా బ్రిటన్లో న్యాయపరమైన అన్ని అవకాశాలను కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే మే 14న విజయ్ మాల్యా దాఖలు చేసిన అన్ని పిటిషన్లను బ్రిటన్ సుప్రీం కోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ మాల్యా దేశంలోకి రావడానికి 28 రోజులు పట్టవచ్చని.. ముందుగా మాల్యాని కస్టడిలోకి తీసుకొని విచారించనున్నారు. మాల్యా భారత్లోకి ప్రవేశించగానే ఏ విధంగా విచారించాలో […]
లిక్కర్ డాన్ విజయ్ మాల్యా కథ కంచికి చేరింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన విజయ్మాల్యా బ్రిటన్లో న్యాయపరమైన అన్ని అవకాశాలను కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే మే 14న విజయ్ మాల్యా దాఖలు చేసిన అన్ని పిటిషన్లను బ్రిటన్ సుప్రీం కోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ మాల్యా దేశంలోకి రావడానికి 28 రోజులు పట్టవచ్చని.. ముందుగా మాల్యాని కస్టడిలోకి తీసుకొని విచారించనున్నారు.
మాల్యా భారత్లోకి ప్రవేశించగానే ఏ విధంగా విచారించాలో సీబీఐ, ఈడీ అధికారులు ఆలోచిస్తున్నారట. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడడం, ఎయిర్లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాల్యా భారత్లో విచారణను తప్పించుకోవడానికి అన్ని అవకాశాలను కోల్పోయారని యూకే న్యాయ నిపుణులు పేర్కొన్నారు.