కంటతడి పెట్టించిన మేజర్ భార్య వీడ్కోలు తీరు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ శంకర్ డౌండియాల్‌కు అతని స్వస్థలం డెహ్రాడూన్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంలో డౌండియాల్‌కు అతని భార్య నికిత వీడ్కోలు పలికారు. భర్తకు కడసారిగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త పార్ధీవ దేహం పక్కనే కూర్చొని ఏడ్చింది. వీరికి గతేడాదే పెళ్లి జరిగింది. నికిత మాట్లాడుతూ దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేయడం తనకు గర్వంగా […]

కంటతడి పెట్టించిన మేజర్ భార్య వీడ్కోలు తీరు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:55 PM

న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ శంకర్ డౌండియాల్‌కు అతని స్వస్థలం డెహ్రాడూన్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంలో డౌండియాల్‌కు అతని భార్య నికిత వీడ్కోలు పలికారు. భర్తకు కడసారిగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త పార్ధీవ దేహం పక్కనే కూర్చొని ఏడ్చింది. వీరికి గతేడాదే పెళ్లి జరిగింది. నికిత మాట్లాడుతూ దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేయడం తనకు గర్వంగా ఉందని అన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత జవాన్లు ఉగ్రవాదులతో పోరాడారు. ఈ పోరాటంలో నలుగురు భారత సైనికులు కన్నుమూశారు. అందులో మేజర్ శంకర్ డౌండియాల్ ఒకరు. డౌండియాల్ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.