ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

ప్రయాణికులతో వెళ్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దానిని వెంటనే గమనించిన బస్సు సిబ్బంది అప్రమత్తమవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు నుంచి బెంగళూరుకు వెళ్తోన్న ఓ ట్రావెల్ బస్సులో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ అవ్వడంతో మంటలు మొదలయ్యాయి. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన సిబ్బంది డ్రైవర్‌కు చెప్పి బస్సును నిలిపివేశారు. అనంతరం […]

ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 10:56 AM

ప్రయాణికులతో వెళ్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దానిని వెంటనే గమనించిన బస్సు సిబ్బంది అప్రమత్తమవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు నుంచి బెంగళూరుకు వెళ్తోన్న ఓ ట్రావెల్ బస్సులో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ అవ్వడంతో మంటలు మొదలయ్యాయి. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన సిబ్బంది డ్రైవర్‌కు చెప్పి బస్సును నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులందరనీ బస్సు నుంచి కిందకు దింపేశారు. ఇది జరిగిన కాసేపటికి బస్సు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తృటిలో ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నారు.