విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గొల్లపల్లిలోని భూ లోకమాంబ ఫైర్ వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందులో పని చేస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారంమందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. బాణాసంచా తయారీలో భాగంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. దాసరి సత్యం, గంగమ్మ, రాములమ్మ, కోటమ్మ చిన్న, కనకరాజు, సింగంపల్లి దుర్గారావు ప్రమాదంలో గాయపడ్డవారిలో ఉన్నారు. గాయపడ్డవారంతా దాదాపు ఒకే కుటుంబానికి చెందినవారు. […]

విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2019 | 4:08 PM

విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గొల్లపల్లిలోని భూ లోకమాంబ ఫైర్ వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందులో పని చేస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారంమందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. బాణాసంచా తయారీలో భాగంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. దాసరి సత్యం, గంగమ్మ, రాములమ్మ, కోటమ్మ చిన్న, కనకరాజు, సింగంపల్లి దుర్గారావు ప్రమాదంలో గాయపడ్డవారిలో ఉన్నారు. గాయపడ్డవారంతా దాదాపు ఒకే కుటుంబానికి చెందినవారు. కాగా.. మూడేళ్ల క్రితం ఇదే ఫైర్ వర్క్స్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందినట్టుగా సమాచారం.