మాస్క్తో మహేష్ బాబు.. ఇది అత్యవసరం !
కరోనాపై పోరాటానికి మాస్క్ అవసరం గురించి మరోసారి గుర్తు చేశారు సూపర్స్టార్ మహేష్బాబు. కొడుకు గౌతమ్, కూతురు సితారలతో ఆడుకుంటున్న పిక్స్, వీడియోలు షేర్ చేస్తూనే, మరోవైపు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
కరోనాపై పోరాటానికి మాస్క్ అవసరం గురించి మరోసారి గుర్తు చేశారు సూపర్స్టార్ మహేష్బాబు. కొడుకు గౌతమ్, కూతురు సితారలతో ఆడుకుంటున్న పిక్స్, వీడియోలు షేర్ చేస్తూనే, మరోవైపు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కరోనా నివారణకై మార్గదర్శకం అవుతోంది.
ఈ విపత్కర సమయంలో నిజాన్ని అంగీకరిద్దాం.. ముఖానికి మాస్క్ని కంపల్సరీ చేసుకుందామంటూ ట్వీట్ చేశారు. బైటికెళ్లే ప్రతీ సందర్భంలోనూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించాలన్నారు. నిదానంగానైనా ఖచ్చితంగా మన కళ్లు తెర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రిన్స్.
ముఖానికి మాస్క్ అనేది ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. కానీ.. ఇది అత్యవసరం కూడా. అందుకే తప్పనిసరిగా మాస్క్ ధరిద్దాం. కొత్త జీవితంలో మాస్క్ అనేది సహజసిద్ధమైన అలవాటుగా మార్చుకోవాలని ట్వీట్ చేశారు. దీనికి తాను సిద్ధంగా వున్నానని చెబుతూ.. మరి మీరు.. అని సూటిగా ప్రశ్నించారు మహేష్బాబు.
We are opening up. Slowly, but surely. In a time like this, masks are mandatory. Make it a point to wear a mask every time you step out, that’s least we can do to protect ourselves and others. pic.twitter.com/2ld3xW9ifM
— Mahesh Babu (@urstrulyMahesh) May 22, 2020