Sarileru Neekevvaru Movie : మహేష్ బ్లాక్‌‌‌‌‌‌‌బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఏడాది పూర్తి..

సువర్ స్టార్  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో

Sarileru Neekevvaru Movie : మహేష్ బ్లాక్‌‌‌‌‌‌‌బస్టర్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు ఏడాది పూర్తి..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 3:36 PM

Sarileru Neekevvaru : సువర్ స్టార్  మహేష్ బాబు నటించిన’సరిలేరు నీకెవ్వరు’సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించి. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో (జనవరి 11) ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తయ్యింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులు హడావిడి చేస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ”జనవరి 11, 2020 సరిలేరు నీకెవ్వరు గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు. థియేటర్స్ అన్ని ఒక పండగలా ఊగిపోయిన `సంక్రాంతి`. ఆ విజువల్స్ `కొండారెడ్డి బురుజు`… `అల్లూరి సీతరామరాజు`, మహేష్ గారి నోట`చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు` అనే మాటలు…`మైండ్ బ్లాక్` అంటూ ఆయన వేసిన స్టెప్పులు ఇలా ఎన్నో…`సరిలేరు నీకెవ్వరు` కరెక్ట్ గా నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా టీమ్ తరుపున తెలుగు ప్రేక్షకులకు, మహేష్ గారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`అంటూ ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మరిన్ని ఇక్కడ చదవండి  : 

Anasuya In Sunil’s Next : సునీల్ కు జోడీగా ‘జబర్దస్త్’ యాంకర్.. ‘వేదాంతం రాఘ‌వ‌య్య’లో హీరోయిన్ గా..

India-China Border News: చైనా జవాన్ ను తిరిగి అప్పగించిన భారత ఆర్మీ.. గత నాలుగు నెలలో ఇది రెండోసారి