మేమంతా మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం…
‘మేము మీకోసం ప్రార్థిస్తున్నాం సార్.. మీరు త్వరగా కోలుకోవాలి. ఈ కఠినమైన సమయంలో మీ కుటుంబానికి మా ప్రార్థనలు బలాన్ని చేకూర్చాలి’అని ఆయన ట్వీట్ చేశారు...
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజ, హోమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సుపర్స్టార్ మహేశ్బాబు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మేము మీకోసం ప్రార్థిస్తున్నాం సార్.. మీరు త్వరగా కోలుకోవాలి. ఈ కఠినమైన సమయంలో మీ కుటుంబానికి మా ప్రార్థనలు బలాన్ని చేకూర్చాలి’అని ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో చెన్నై ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటిలేటర్పై ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. నిపుణుల బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.