‘మహర్షి’ 50రోజుల వేడుక వాయిదా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఇటీవల 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 50రోజుల వేడుకను గ్రాండ్గా చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు ఈ నెల 28న వేదికగా శిల్పా కళా వేదికను కూడా ఖరారు చేశారు. అయితే సీనియర్ నటి విజయనిర్మల మరణంతో కృష్ణ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో మహర్షి 50రోజుల వేడుక కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. […]
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఇటీవల 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 50రోజుల వేడుకను గ్రాండ్గా చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు ఈ నెల 28న వేదికగా శిల్పా కళా వేదికను కూడా ఖరారు చేశారు. అయితే సీనియర్ నటి విజయనిర్మల మరణంతో కృష్ణ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో మహర్షి 50రోజుల వేడుక కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తిరిగి ఆ కార్యక్రమం ఎప్పుడుంటుందన్న విషయాన్ని వారు ఇంకా ప్రకటించలేదు. కాగా విజయనిర్మల మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులందరూ ఆమె మృతిపై ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.
#Maharshi 50 days event which was scheduled for 28th June 2019 stands postponed.
— Sri Venkateswara Creations (@SVC_official) June 27, 2019