రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలో మహేష్ నటించనున్నాడా?

'సరిలేరు నీకేవ్వరు' తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం "సర్కారు వారి పాట". త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో

రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలో మహేష్ నటించనున్నాడా?
Follow us

|

Updated on: Dec 04, 2020 | 5:52 PM

‘సరిలేరు నీకేవ్వరు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ నటిస్తుంది. మొదటి సారి కీర్తి సురేష్, మహేష్ జంటగా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగానే అంచానాలున్నాయి. గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ అనంతరం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లుగా టాక్. దర్శకుడు వెంకీ కుడుముల నితిన్, రష్మిక మందన కాంబినేషన్‏లో భీష్మ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ విజయాన్ని తన ఖతాలో వేసుకున్నాడు వెంకీ కుడుముల.

అయితే ఇటీవల వెంకీ ఒక కథతో మెగా హీరో రామ్ చరణ్‏ వద్దకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. కానీ రామ్ చరణ్ మాత్రం ఆ సినిమాకు నో చెప్పాడట. ఆ తర్వాత వెంకీ అదే కథను సూపర్ స్టార్ మహేష్‏కు చెప్పినట్లుగా తెలుస్తోంది. వెంకీ చెప్పిన కథ మహేష్‏కు నచ్చడంతో వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పారని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కోడుతుంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే వార్తా గనుక నిజమైతే త్వరలో వెంకీ, మహేష్ కలయికలో ఓ సినిమా వచ్చేలా ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇంకా చదవండి: