“మహా”లో రికార్డు స్థాయిలో 6,330 కరోనా కేసులు
మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే కొత్తగా 6,330 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొ్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరుకోగా, ఇవాళ 125 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.
కరోనా కల్లోలానికి మహారాష్ర్ట విలవిలలాడుతోంది. రోజు రోజు నమోదవుతున్న కొత్త కేసులతో జనం బెంబెలేత్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడిక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొవిడ్ పాజిటివ్ కేసులతో ముంబై ఆస్పత్రులు నిండుతున్నాయి. దీంతో మహారాష్ర్ట ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గురువారం ఒక్కరోజే కొత్తగా 6,330 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొ్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరుకోగా, ఇవాళ 125 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. కరోనాను జయించిన 8,018 మంది గురువారం డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ఇవాళ చనిపోయిన 125 మందితో కలిపి మరణాల సంఖ్య 8,178కి చేరింది అని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.