11 లక్షలు పలికిన దావూద్‌ ఇబ్రహీం పూర్వీకుల ఇల్లు

పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇంటిని 11.20 లక్షల రూపాయలిచ్చి కొనుకున్నారు అజయ్‌ శ్రీవాస్తవ్‌ అనే లాయర్‌!

11 లక్షలు పలికిన దావూద్‌ ఇబ్రహీం పూర్వీకుల ఇల్లు
Follow us

|

Updated on: Nov 11, 2020 | 11:28 AM

పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇంటిని 11.20 లక్షల రూపాయలిచ్చి కొనుకున్నారు అజయ్‌ శ్రీవాస్తవ్‌ అనే లాయర్‌! దావూద్‌ పూర్వీకుల ఇల్లు ఇబ్రహీం మాన్షన్‌తో పాటు మరో అయిదు స్థిరాస్తులను నిన్న వేలం వేశారు.. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో ఉన్న ఇబ్రహీం మాన్షన్‌ను ఢిల్లీకి చెందిన జయ్‌ శ్రీవాస్తవ కొన్నారు.. 1983లో దావూద్‌ కుటుంబం ఈ ఇంటిని విడిచిపెట్టి ముంబాయికి వెళ్లిపోయింది.. ఇక దావూద్‌ తల్లి అమీన్‌ బీ, సోదరి హసీనా పర్కార్‌ పేరిట ఉన్న 25 గుంటల భూమిని కూడా శ్రీవాస్తవే కొన్నారు.. ఇందుకోసం ఆయన 4.30 లక్షల రూపాయలు చెల్లించారు. ఇక రత్నగిరి జిల్లాలోని లోటే గ్రామంలో ఉన్న ఓ ప్లాట్‌ టెక్నికల్‌ రీజన్స్‌తో అమ్ముడు పోలేదు.. అలాగే దావూద్‌ సన్నిహితుడు ఇక్బాల్‌ మిర్చి ఫ్లాట్‌ కూడా అమ్ముడుకాలేదు.. ఈ రెండింటిని మళ్లీ వేలం వేయనున్నారు. దావూద్‌ ఆస్తులను కొనడం వెనుక ఇష్టమేమీ లేదని, తాము అతడిని భయపడటం లేదని చెప్పడానికే కొన్నానని శ్రీవాత్సవ అంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. దావూద్‌ ఆస్తులను గతంలో వేలం వేసినప్పుడు కూడా శ్రీవాస్తవ కొనుగోలు చేశారు.. అప్పట్లో దావూద్ అనుచ‌రుల నుంచి బెదిరింపులు వచ్చినా శ్రీవాత్సవ లెక్క చేయలేదు..