“మహా”లో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,251 కరోనా పాజిటివ్ కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,251 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,368కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,07,194 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,45,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 257 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ ముంబై నగరంలో 1,07,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 78,877 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Maharashtra reports 9,251 new #COVID19 cases and 257 deaths today. The total number of cases in the State rises to 3,66,368 including 1,45,481 active cases and 2,07,194 discharged cases: State Health Department pic.twitter.com/UPHUGezKHA
— ANI (@ANI) July 25, 2020
1090 #COVID19 positive cases and 52 deaths reported in #Mumbai today; 617 patients recovered and discharged. The total positive cases rise to 1,07,981 including 78,877 patients recovered and discharged & 6033 deaths: Municipal Corporation Greater Mumbai pic.twitter.com/ugu6x8BOgi
— ANI (@ANI) July 25, 2020