మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,483 కరోనా పాజిటివ్ కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,483 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,262కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 3,27,281 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,45,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 17 వేల మందికి పైగా మరణించారు. ఇక రాష్ట్రంలో ముంబై, పూణే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ధారవిలో రోజు పది లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ధారవిలో 100 లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి.
10,483 #COVID19 cases & 300 deaths reported in Maharashtra today. Total number of cases in the state is now at 4,90,262, including 1,45,582 active cases, 3,27,281 recovered & 17,092 deaths: State Health Department pic.twitter.com/ecEa2o0vBd
— ANI (@ANI) August 7, 2020