మహారాష్ట్రలో తగ్గని కరోనా కేసులు.. తాజా వివరాలు ఇవే..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా 7,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,427కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.40 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 173 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పూణె, థానే నగరాల్లో నమోదవుతున్నాయి.
Maharashtra reported 7,827 new COVID-19 cases and 173 deaths in the last 24 hours, taking total number of cases to 2,54,427 including 1,40,325 recoveries and 10,289 deaths: State Health Department pic.twitter.com/yTpJu87wiF
— ANI (@ANI) July 12, 2020