మహారాష్ట్రలో ఫడ్నవీస్ బల నిరూపణ ? గవర్నర్ ఆహ్వానం

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన ఇప్పటికీ పేచీ పడుతుండగా.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ వైపు మొగ్గారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ పార్టీని కోరారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ పార్టీ కోర్ గ్రూప్ ఆదివారం సమావేశమవుతోంది. మరోవైపు-శివసేన తమ ఎమ్మెల్యేలందరినీ ముంబై శివార్లలోని మధ్ ఐలాండ్ రిసార్టుకు తరలించింది. వారిని బీజేపీ ప్రలోభ పెట్టకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఈ […]

మహారాష్ట్రలో ఫడ్నవీస్ బల నిరూపణ ? గవర్నర్ ఆహ్వానం
Follow us

|

Updated on: Nov 10, 2019 | 11:13 AM

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన ఇప్పటికీ పేచీ పడుతుండగా.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ వైపు మొగ్గారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ పార్టీని కోరారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ పార్టీ కోర్ గ్రూప్ ఆదివారం సమావేశమవుతోంది. మరోవైపు-శివసేన తమ ఎమ్మెల్యేలందరినీ ముంబై శివార్లలోని మధ్ ఐలాండ్ రిసార్టుకు తరలించింది. వారిని బీజేపీ ప్రలోభ పెట్టకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఈ రిసార్టులో ఆదిత్య థాక్రే కూడా వీరి వెంటే ఉన్నారు. బీజేపీ 105, సేన 56 సీట్లను గెలుచుకున్న సంగతి విదితమే. అయితే పేచీ అధికార పంపిణీపైనే వచ్చింది. చెరి సగం అధికారాన్ని [పంచుకోవాలని సేన కోరుతుండగా ఇందుకు బీజేపీ ససేమిరా అంటోంది. ఈ తాజా పరిణామాలను ఎన్సీపీ నిశితంగా గమనిస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో శాసన సభలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం పడిపోయిన పక్షంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము యత్నిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ సర్కార్ ని పడగొట్టడానికి శివసేన అసెంబ్లీలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రయత్నిస్తుందేమో చూస్తామన్నారు. ఈ నెల 12 న తమ పార్టీ శాశన సభ్యులంతా సమావేశమవుతారని భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఆ సమావేశానికి సీనియర్ నేత శరద్ పవార్ కూడా హాజరవుతారని మాలిక్ వెల్లడించారు.