మహారాష్ట్ర.. గవర్నర్ చేతిలో సీఎం ఉద్దవ్ థాక్రే భవితవ్యం
మహారాష్ట్రలో అసలే పెరుగుతున్న కరోనా కేసులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం సతమతమవుతుండగా..ఆయనకు కొత్త తలనొప్పి మొదలైంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉధ్ధవ్...
మహారాష్ట్రలో అసలే పెరుగుతున్న కరోనా కేసులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం సతమతమవుతుండగా..ఆయనకు కొత్త తలనొప్పి మొదలైంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉధ్ధవ్ బుధవారం రాత్రి హఠాత్తుగా ప్రధాని మోదీకి ఫోన్ చేయడం సంచలన విషయమైంది, తన ‘కుర్చీ’ఎక్కడ పడిపోతుందోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. దీనిపై మోదీ.. సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇఛ్చినట్టు చెబుతున్నారు. ఉధ్ధవ్ థాక్రేని శాసన మండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం తీర్మానించి ఇందుకు సంబంధించి సిఫారసును గవర్నర్ కోష్యారీకి పంపింది. అయితే దీనిపై గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అటు బుధవారం జరగవలసిన మంత్రివర్గ సమావేశం రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికలను త్వరలో నిర్వహించాల్సి ఉండగా కరోనా సంక్షోభం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో కేబినెట్ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించవచ్ఛు. ఉధ్దవ్ ప్రస్తుతం లెజిస్లేటర్ కానందున కౌన్సిల్ కు మే 28 లోగా ఎన్నికలు జరగవలసి ఉంది. ఆలోగా ఇది జరగకపోతే ఆయన తన పదవిని కోల్పోవలసి వస్తుంది. (ఆ రోజుతో సీఎం గా ఆయన పదవీకాలం ఆరు నెలలు పూర్తి అవుతుంది). అయితే ఏ కారణం వల్లో గవర్నర్ కోష్యారీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.