బెంగుళూరు.. రిసార్ట్ లో మధ్యప్రదేశ్ మంత్రికి చేదు అనుభవం
బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీని పోలీసులు అడ్డుకున్నారు.
బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను, లఖన్ సింగ్ అనే ఎమ్మెల్యేని వారు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ రిసార్ట్ వద్ద తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుగుబాటు శాసన సభ్యులను కలుసుకునేందుకు జీతూ పట్వారీని పోలీసులు అనుమతించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా-తమ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసిందని, వారిని విడుదల చేయకపోతే తాము కోర్టుకెక్కుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అటు-జీతును పోలీసులు అడ్డుకుంటున్న వీడియో వైరల్ అయింది. బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్ లో బస చేసిన సంగతి విదితమే.
Karnataka: Congress leader Jitu Patwari was taken into preventive custody by police, from outside Embassy Boulevard in Bengaluru where he had a scuffle with a police personnel. He had gone to Embassy Boulevard to meet Madhya Pradesh rebel MLAs. https://t.co/hsrLf7DtZN pic.twitter.com/zVceqDKoBY
— ANI (@ANI) March 12, 2020