సైకిల్పై స్కూల్కి 24 కిలో మీటర్లు.. మెరిట్ లిస్ట్లో చిన్నారి..
చదువు అంటే ఆమెకు ప్రాణం. తమ గ్రామంలో స్కూల్ లేకపోవడంతో.. చదువు కోసం రోజూ 24 కిలీమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేది. ఎండనక, వాననక రోజూ సైకిల్పై వెళ్లి వచ్చేది. అలాగే ఎంతో కష్టపడి చదివి మెరిట్ లిస్టులో స్థానం కూడా సంపాదించుకుని వార్తల్లో..
చదువు అంటే ఆమెకు ప్రాణం. తమ గ్రామంలో స్కూల్ లేకపోవడంతో.. చదువు కోసం రోజూ 24 కిలీమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేది. ఎండనక, వాననక రోజూ సైకిల్పై వెళ్లి వచ్చేది. అలాగే ఎంతో కష్టపడి చదివి మెరిట్ లిస్టులో స్థానం కూడా సంపాదించుకుని వార్తల్లో నిలిచింది ఈ బాలిక. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్లోని భింద్ జిల్లాకు చెందిన రోషిణి భదౌరియ అనే 15 ఏళ్ల బాలికకు చదువు అంటే చాలా ఇష్టం. తమ గ్రామంలోని పాఠశాల లేకపోవడంతో.. వేరే గ్రామానికి రోజూ సైకిల్పై స్కూల్కి 24 కిలో మీటర్లు వెళ్లి తిరిగి వచ్చేది రోషిణి భదౌరియా. అలాగే 10 తరగతి పరీక్షల్లో కూడా అత్యద్భుత మార్కులు సాధించింది. రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 98.5 శాతం మార్కులు సాధించి, మెరిట్ లిస్ట్లో 8వ స్థానంలో నిలిచింది రోషిణి. గణితం, సైన్సులో 100కి 100 మార్కులు సాధించింది.
ఈ సందర్భంగా రోషిణి మాట్లాడుతూ.. నేను కలెక్టర్ని కావాలనుకుంటున్నా. అందుకే పాఠశాల ఎంత దూరమున్నా కూడా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నా. కలెక్టర్గా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. పెద్ద నగరాల్లో, పెద్ద సంస్థల్లో పని చేయాలనుకుంటున్నట్లు రోషిణి తన అభిమతాన్ని వెల్లడించింది. ఇక రోషిణి తండ్రి పేరు పురుషోత్తం భదౌరియా. ఆయన గ్రాడ్యుయేట్ అయినప్పటికీ వ్యవసాయం చేస్తున్నాడు. తన కుమార్తె చూపించిన ప్రతిభకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. నిజంగానే నా కూతుర్ని కలెక్టర్ చేస్తానని వెల్లడించారు.
Read More: