మధుప్రకాషే చంపేశాడు: తల్లి తిరుమల ఆగ్రహం

సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య భారతి మృతిపై ఆమె తల్లి తిరుమల కూడా స్పందించారు. మధు ప్రకాషే తన కూతురును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. సీరియల్లో నటిస్తున్న మరో మ హిళతో మధు ప్రకాష్‌కి వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతో తన కూతురుని నిర్లక్ష్యం చేసాడని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. చాలా సార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.. వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం […]

మధుప్రకాషే చంపేశాడు: తల్లి తిరుమల ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:23 PM

సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య భారతి మృతిపై ఆమె తల్లి తిరుమల కూడా స్పందించారు. మధు ప్రకాషే తన కూతురును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. సీరియల్లో నటిస్తున్న మరో మ హిళతో మధు ప్రకాష్‌కి వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతో తన కూతురుని నిర్లక్ష్యం చేసాడని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. చాలా సార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.. వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేసామని.. మధు ప్రకాష్ మాత్రం మా మాటలు పట్టించుకోలేదని భారతి తల్లి చెప్పారు. 2015లో మధుప్రకాష్‌కి దాదాపు రూ.15 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసామన్నారు. కానీ.. తను తన కూతరిని పొట్టన పెట్టుకున్నాడని వాపోయారు. మధు ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భారతి తల్లి తిరుమల.