ఇంకా లభించని అశోక్ ఆచూకీ !
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో కిడ్నాప్కు గురైన బాలుడు అశోక్ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. బాలుడు మిస్సై గంటలు గడుస్తున్నప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. మదనపల్లె మండలం సీటీఎంలో ఈ నెల 22న ఆరేళ్ల బాలుడు అశోక్ మిస్సైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అశోక్ను శాంతమ్మ అనే మహిళ ఎత్తుకెళ్లినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు…శాంతమ్మ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిందితురాలిగా అనుమానిస్తున్న శాంతమ్మపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. […]
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో కిడ్నాప్కు గురైన బాలుడు అశోక్ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. బాలుడు మిస్సై గంటలు గడుస్తున్నప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. మదనపల్లె మండలం సీటీఎంలో ఈ నెల 22న ఆరేళ్ల బాలుడు అశోక్ మిస్సైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అశోక్ను శాంతమ్మ అనే మహిళ ఎత్తుకెళ్లినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు…శాంతమ్మ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిందితురాలిగా అనుమానిస్తున్న శాంతమ్మపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం ముల్బాగల్కు చెందిన ఆనంద్ జీవనోపాధి కోసం కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలిసి మదనపల్లె వచ్చాడు. ఇదే మండలం సీటీఎం రైల్వేస్టేషన్ వద్ద చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని బట్టల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అశోక్ అదృశ్యమయ్యాడు. అశోక్ ఆచూకీ కోసం పలుప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎస్ఐ దిలీప్ సిబ్బందితో కలసి రైల్వేస్టేషన్ చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ చిన్నారితో వచ్చిన గుర్తుతెలియని మహిళ గుడారం వద్ద నిలబడి ఉండడం గుర్తించి ఆమె బాలుడిని కిడ్నాప్ చేసి ఉండవచ్చని భావించారు. అనంతరం వివరాలు పరిశీలించగా కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన శాంతమ్మ అలియాస్ నరసమ్మగా గుర్తించారు. నిందితురాలిగా అనుమానిస్తున్న శాంతమ్మపై కర్నాటకలోని కోలారు జిల్లా ధూల్పేట, తిరుపతి క్రైం, మదనపల్లె టూటౌన్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. ఇటీవల తిరుపతిలో మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసినట్లుగా చెప్పారు. నిందితురాలి కోసం రెండు ప్రత్యేక బృందాలతో తిరుపతి, కోలారు, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పోలీసుల గాలింపు కొనసాగుతోంది.