ప్రియుడి మోజులో భర్త హత్య.. ‘లాక్‌డౌన్‌’లోనూ పక్కా ప్లాన్..!

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి 'లాక్‌డౌన్‌'లోనూ పక్కా ప్లాన్ తో సినీ ఫక్కీలో లారీతో గుద్దించి భర్తను హత్య చేయించింది.

ప్రియుడి మోజులో భర్త హత్య.. 'లాక్‌డౌన్‌'లోనూ పక్కా ప్లాన్..!
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 10:08 AM

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ‘లాక్‌డౌన్‌’లోనూ పక్కా ప్లాన్ తో సినీ ఫక్కీలో లారీతో గుద్దించి భర్తను హత్య చేయించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ దారుణ ఘటన జరిగింది. పెద్దమండ్యం మండలం సిద్దవరం పంజాయితీ చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం, మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

కాగా కొన్నాళ్లే పాటు మదనపల్లెలో గిఫ్‌ సెంటర్ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోగా.. రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రేణుక పిల్లలతో పాటు మదనపల్లెలో ఉండగా.. ఈ క్రమంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అతడి కోసం ఆమె పార్టీలో కార్యకర్తగా కూడా చేరింది. ఇక ఇటీవల బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్‌ వ్యాపారం మానేసి తిరిగి మదనపల్లెకు వచ్చేయగా.. ప్రియుడిని కలిసేందుకు రేణుకకు ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల పేరుతో బయటికు వెళ్లి నాగిరెడ్డితో రాసలీలలు సాగిస్తుండగా.. ఈ విషయం తెలిసిన సుబ్రహ్మణ్యం రేణుకను హెచ్చరించాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు నాగిరెడ్డితో కలిసి రేణుక ప్లాన్ చేసింది.

ఇక శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు ఎక్కువ కాగా.. మాత్రలు తెచ్చుకోవాలని రాత్రి 11గంటల సమయంలో అతడిని బయటకు పంపింది. ఆ తరువాత ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అంతకుముందే పక్కా పథకం వేసుకున్న నాగిరెడ్డి తనకు తెలిసిన వారి లారీతో నాగిరెడ్డిని ఢీకొట్టించాడు. ఈ ఘటనలో బాలసుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అర్ధరాత్రి సమయంలో బాలసుబ్రమణ్యం బయటకు రావడంతో స్థానికులకు అనుమానం రాగా.. అతడి సోదరుడు, లాయర్ అయిన కె.రఘుపతి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇందులో భాగంగా రేణుక, నాగిరెడ్డి మధ్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. బాలసుబ్రమణ్యం బయటకు వెళ్లాక రేణుక నాగిరెడ్డికి ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు.

Read This Story Also: చిరు నిర్ణయం.. ఆమెకు మరో ఛాన్స్‌..!