అమరావతి ఇష్యూని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా: నరేష్

అమరావతినే ఏపీకి రాజధానిగా చేయాలని స్థానిక రైతులు గత 30 రోజులుగా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు తావు లేపింది. ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా స్పందించాలని పలువురు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వివాదంపై.. హీరోలు బాలకృష్ణ, నారా రోహిత్‌లు, సింగర్ స్మితలు స్పందించారు. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై మా అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు. ఓ పౌరుడుగా తాను అమరావతి గురించి ట్వీట్ చేశానని, అలాగే ఈ […]

అమరావతి ఇష్యూని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా: నరేష్
Follow us

| Edited By:

Updated on: Jan 16, 2020 | 5:26 PM

అమరావతినే ఏపీకి రాజధానిగా చేయాలని స్థానిక రైతులు గత 30 రోజులుగా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు తావు లేపింది. ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా స్పందించాలని పలువురు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వివాదంపై.. హీరోలు బాలకృష్ణ, నారా రోహిత్‌లు, సింగర్ స్మితలు స్పందించారు. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై మా అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు. ఓ పౌరుడుగా తాను అమరావతి గురించి ట్వీట్ చేశానని, అలాగే ఈ వివాదాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళతానని  ‘మా’ అధ్యక్షుడు నరేష్ పేర్కొన్నారు.

అమరావతి రాజధాని రైతులకు సపోర్ట్‌గా టాలీవుడ్ సినీ నటులు తమ మద్దతు తెలిపాలని మా అధ్యక్షుడు నరేష్‌కు వినతి పత్రం అందజేశారు సినీ నటి మాధవీలత. ఈ విషయంపై మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు నరేష్.