‘మా’ని ముసురుతోన్న విభేదాలు..ఎందుకు పదే, పదే పలచనవుతున్నారు..!

ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో ‘మా’ అసోషియేషన్‌లో మరో వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకే ప్యానల్‌ నుంచి […]

'మా'ని ముసురుతోన్న విభేదాలు..ఎందుకు పదే, పదే పలచనవుతున్నారు..!
Follow us

|

Updated on: Oct 21, 2019 | 4:20 AM

ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి.

ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో ‘మా’ అసోషియేషన్‌లో మరో వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకే ప్యానల్‌ నుంచి పోటి చేసిన నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య ఇప్పుడు గొడవ రాజుకుంది. అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే ఎక్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, సెక్రటరీ జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో ఆయన తరపు న్యాయవాది స్పదించారు. అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు.

అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్‌ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు.

ఎవరి గ్రూపులు వారివే : పృథ్వీ

‘ఎన్నికలు ముగిసి 8 నెలలు పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరూ ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియాలా ఫీలవుతున్నారు. అందరూ కలసి పనిచేయండి. ఈసీ సభ్యులు 26 మంది ఉన్నారు. ఒక్కొక్కరూ పది మందిని దత్తత తీసుకుని తలా కొంచెం ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వాళ్ల బాగోగులు చూడాలి కానీ ఇవేం గొడవలు. అత్యవసర సమావేశం అని తిరుపతి నుంచి వస్తే ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 400 సినిమాలకు రచయితగా పని చేసిన మా గురువు పరుచూరి గోపాలకృష్ణని కూడా మాట్లాడనివ్వలేదు. ఆయన సమస్కారం పెట్టినా అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరం. నాకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదు. ‘మా’ తీరు మారకుంటే రాజీనామా చేస్తా. ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం. ‘ మా’లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారు. మెంబర్లు కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు పృథ్వీ.

ఎప్పటినుంచి ఈ విభేదాలు: 

మా అధ్యక్షుడిగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జీవితా సెక్రటరీగా ఉన్నారు. గత మూడు నెలలుగా వీరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. రాజశేఖర్ తన అనకూలంగా ఉన్న 21మందితో కలిసి నరేష్‌కు నోటీసులు అందించినట్లుగా తెలుస్తోంది. గత 9నెలలుగా మాలో ఏం జరుగుతుంది ? ఎంత ఫండింగ్ అందింది? ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి అన్న దానిపై జీవితా రాజశేఖర్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య దూరం మరింత పెరుగుతోంది.

ఆ ఐదున్నర కోట్లు ఏమయ్యాయి? మా కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలల అవుతున్నా ఇప్పటివరకు ఫండ్స్‌ కలెక్ట్‌ చేయలేదని ఆధ్యక్షుడు నరేశ్‌పై రాజశేఖర్‌ కార్యవర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా మా లో ఉన్న మూల ధనం రూ. 5.5 కోట్లు ఏమయ్యాయని అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు. గతంలో మూల ధనాన్ని కదపకుండా ఈవెంట్స్‌ స్పాన్లర్ల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసిందని, కానీ నరేశ్‌  మూలధనం నుంచే ఖర్చులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు ‘మా’లో ఏర్పడిన పరిస్థితిక నరేశే కారణమంటూ జీవిత రాజశేఖర్‌ కార్యవర్గం మండిపడుతోంది.

నరేశ్‌కు..మాజీ అధ్యక్షుడు శివాజీరాజాతోనూ విభేదాలు:ప్రస్తుత ‘మా’ అద్యక్షుడు నరేశ్‌కు..మాజీ అధ్యక్షుడు, గత ఎన్నికలలో ఓడిపోయిన శివాజీరాజాకు కూడా తారా స్థాయిలో విభేదాలు చెరరేగాయి. మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు వచ్చిన ఫండ్‌కు సంబంధించి నరేశ్..శివాజీరాజాపై ప్రశ్నోత్తరాలు స్పందించారు. విషయం శృతి మించడంతో అప్పట్లో ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకోని పరిస్థితిని చక్కదిద్దారు.

‘మా’గౌరవాన్ని కాపాడుదాం: కృష్ణంరాజు కోర్డు ఆర్డర్‌ ప్రకారం ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని ‘మా’ చీఫ్‌ అడ్వైజర్‌ కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా ఈ మీటింగ్‌కు వచ్చిన వారి చేత ఎలాంటి సంతకాలు పెట్టించమన్నారు. ఒకవేళ సంతకాలు పెట్టిదలచిన వారు పూర్తిగా విషయం గురించి చదివి సరియైనది అని భావిస్తేనే సంతకం పెట్టాలన్నారు. ఏ నిర్ణయమైనా అందరూ కలిసి చర్చించుకుని తీసుకోవాలన్నారు. 25 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ ఇప్పటివరకు అందరూ మెచ్చుకునేలా ఉందని, ఇకపై కూడా అలాగే గౌరవంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.

చిరంజీవి కలగజేసుకుంటారా :

మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదా అంటే..అవుననే అంటున్నారు పలువురు పరిశీలకులు. గతంలో ఇటువంటి విభేదాలు చెలరేగినప్పుడు దర్శకుడు దాసరి నారాయణరావుగారు కలగజేసుకొని సమస్యకు పరిష్కారం చూపేశారు. ఆయన కాలం చేయడంతో..బాధ్యత తీసుకునేవాళ్లు లేక పదే, పదే విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకోని ఈ ప్రాబ్లమ్స్‌కు ముగింపు పలుకుతారని అందరూ ఆశిస్తున్నారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు