అడవిలో ప్రేమ జంట ఆత్మహత్య

ఒకరిపైనొకరు మనసు పడ్డారు. పరిచయం నుంచి మొదలై ప్రేమ వరకు వెళ్లింది. ఇద్దరి హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాలకాలం కలిసుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో పావులయ్యారు. కలిసి కాపురం చేయలేక విడివిడిగా ఉండలేక ఆ జంట మరణంతో ఒక్కటయ్యారు. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమోనని, ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు తీసుకున్నారు. రెండు కుటుంబాల్లో ఈ ఘటన తీరని ఆవేదనను మిగిల్చింది.

అడవిలో ప్రేమ జంట ఆత్మహత్య
Follow us

|

Updated on: Aug 06, 2020 | 5:12 PM

ఒకరిపైనొకరు మనసు పడ్డారు. పరిచయం నుంచి మొదలై ప్రేమ వరకు వెళ్లింది. ఇద్దరి హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాలకాలం కలిసుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో పావులయ్యారు. కలిసి కాపురం చేయలేక విడివిడిగా ఉండలేక ఆ జంట మరణంతో ఒక్కటయ్యారు. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమోనని, ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు తీసుకున్నారు. రెండు కుటుంబాల్లో ఈ ఘటన తీరని ఆవేదనను మిగిల్చింది.

కుమురం భీం అసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌ మండలంలోని మామిడిపల్లి, పిక్లాతండా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలానికి చేరుకున్న జైసూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మామిడిపల్లి గ్రామానికి చెందిన మడావి సుర్యారావుకు ఏడుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. విజయలక్ష్మి(20) అయిదో సంతానం. ఏడాది కిందటే ఆమె తండ్రి చనిపోయాడు. ఆమె తన అక్క ఊరైన జైనూర్‌ మండలంలోని రాశిమెట్టకు తరుచు వెళ్లేది. ఇదే క్రమంలో రాశిమెట్టకు చెందిన ఆత్రం సీతారాం కుమారుడు భీంరావ్‌(22)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏడాదిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇదిలావుంటే, మంగళవారం సాయంత్రం విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అంతలోనే బుధవారం సాయంత్రం పిక్లాతండా సమీపంలో ఆ జంట పురుగుల మందు తాగారు. అటవీ ప్రాంతంలో అపస్మరకస్థితిలో పడి ఉన్న ఆ ఇద్దరిని చూసిన పశువుల కాపరి విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే విజయలక్ష్మీ మరణించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భీంరావును పోలీసులు ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలొదిలాడు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయో లేదోననే మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైసూర్ సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!