జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమించిన యువతి ఆత్మహత్య.. తీవ్ర మనస్తాపంతో దుబాయ్లో యువకుడి బలవన్మరణం
ప్రేమకు దూరమవుతున్నానని యువతి.. ఆమె చావుకు తానే కారణమని, మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య.
Lovers suicide in Jagtial district : జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని ప్రేమకు దూరమవుతున్నానని యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె చావుకు తానే కారణమని, మనస్తాపంతో యువకుడు.. ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మానాల రాకేష్(21) అనే యువకుడు దుబాయ్లో బతుకుదెరువు కోసం వెళ్లాడు. లింగంపల్లి గ్రామానికి చెందిన మనీషా గొల్లపల్లిలోని ఓ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కాగా, ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోవడానికి తన ప్రమేయం కూడా ఉందని భావించిన రాకేష్ దుబాయ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, తన వల్ల ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని రాకేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసి అమ్మ నేను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ.. దుబాయిలోని తాను పని చేసే క్యాంపులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.