మహబూబ్నగర్లో ఘోర ప్రమాదం..ఆటోను ఢీకొన్న లారీ.. 14 మంది మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది కూలీలు వ్యవసాయ పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగెళ్తుండగా.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. మృతుల్లో 10 మందికి పైగా మహిళలే ఉన్నారు. గాయపడిన వారిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద […]
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది కూలీలు వ్యవసాయ పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగెళ్తుండగా.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. మృతుల్లో 10 మందికి పైగా మహిళలే ఉన్నారు. గాయపడిన వారిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాద విషయం గుర్తించగానే స్థానికులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం నుంచి ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితులు కొత్తపల్లి, గోగ్యా తండా వాసులుగా గుర్తించారు.