సూర్యప్రభ వాహనంపై దేవదేవుడు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.. కొండలంత వరాలను గుప్పించే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజైన శుక్రవారం ఉదయం వేంకటేశ్వరస్వామికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.. కొండలంత వరాలను గుప్పించే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజైన శుక్రవారం ఉదయం వేంకటేశ్వరస్వామికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. తిరుచ్చిపై సన్నిధి నుంచి కళ్యాణ మండపానికి చేరుకున్న మలయప్పస్వామి సర్వాలంకారభూషితుడై సూర్యప్రభవాహనాన్ని అధిరోహించారు. శంఖు, చక్రం, గధ, అభయాహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. అంటే దివారాత్రాలకు ఆయనే అధిపతి అన్నమాట. కరోనా కారణంగా భక్తుల సందడి లేకపోయినా నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా జరుపుతున్నారు. అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.. సూర్యప్రభ వాహనసేన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అధికారులు పాల్గొన్నారు.