జగన్ వచ్చారని… వరుణుడు పారిపోయాడా? – లోకేశ్
జగన్ వచ్చారని… వరుణుడు పారిపోయాడా అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటుంటే.. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోందని అన్నారు. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైసీపీ నేతలు జగన్ను భగీరథుడు అంటూ… దర్పం ప్రదర్శిస్తున్నారంటూ లోకేష్ తప్పుబట్టారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని […]
జగన్ వచ్చారని… వరుణుడు పారిపోయాడా అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటుంటే.. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోందని అన్నారు. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైసీపీ నేతలు జగన్ను భగీరథుడు అంటూ… దర్పం ప్రదర్శిస్తున్నారంటూ లోకేష్ తప్పుబట్టారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించారు. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరు కావాలంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి వరుణుడు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా ? అన్న ప్రశ్నకు వైసీపీ మేధావులే సమాధానం చెప్పాలన్నారు.
జగన్ వచ్చారని… వరుణుడు పారిపోయాడా?
సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోంది. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోంది. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. pic.twitter.com/jKe9VyYav5
— Lokesh Nara (@naralokesh) August 15, 2019
తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైకాపా నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 3 జిల్లాల్లోనే సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు.
— Lokesh Nara (@naralokesh) August 15, 2019
మరి వరుణుడు ఏమయ్యాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా? వైకాపా మేధావులు మాత్రమే సమాధానం చెప్పాలి.
— Lokesh Nara (@naralokesh) August 15, 2019