కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగింపు..!

పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందే ముగుస్తున్నాయి. గత శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలు కరోనా వైరస్ రావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగింపు..!
Follow us

|

Updated on: Sep 23, 2020 | 9:06 AM

పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందే ముగుస్తున్నాయి. గత శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలు కరోనా వైరస్ రావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. అలాగే రాజ్యసభ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 14న సమావేశాలు ప్రారంభం కాగా.. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు జరగాల్సి ఉంది.

5 బిల్లులపై నిర్ణయం అనంతరం రాజ్యసభ నిరవధిక వాయిదా పడనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుంది. జీరో అవర్‌తో పాటు పలు అంశాలపై చర్చించిన అనంతరం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. 30 మంది ఎంపీలు కరోనా బారిన పడడంతో లోక్‌సభను వాయిదా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు స్పీకర్‌ ఓంబిర్లా.  పార్లమెంట్‌ సెషన్స్‌కు ముందే లోక్‌సభకు చెందిన 17 మంది ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు.