మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. […]

మోగిన ఎన్నికల నగారా
Follow us

| Edited By:

Updated on: Mar 10, 2019 | 6:27 PM

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాం. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని సునీల్‌ అరోరా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదు, ఆరు దశలు మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు అరోడా తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు అరోడా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.

పోలింగ్‌ స్టేషన్లలో పర్యవేక్షణ, సునిశిత పరిశీలన ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. ఓటు హక్కు వినియోగానికి 12 గుర్తింపు కార్డులు పరిగణలోకి తీసుకోనున్నామన్నారు. పోలింగ్‌ కు 5 రోజులు ముందుగా ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుందని.. అయితే ఈ పోల్‌ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోమన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ లు వినియోగిస్తామని తెలిపారు. పర్యావరణహిత ఎన్నికల ప్రచార సామాగ్రి మాత్రమే వినియోగించాలన్నారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లుండగా..వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సున్న ఓటర్లు 1.5 కోట్లున్నారని సీఈసీ తెలిపారు.

ఏడు విడతల్లో లోకసభ ఎన్నికలు

*మార్చి 18న నొటిఫికేషన్‌ విడుదల *ఏప్రిల్‌ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు *ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు *ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు *ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు *మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు *మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు *మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు *మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు

గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక