లాక్ డౌన్ బేఖాతర్.. మసీద్లో వందమంది ప్రార్ధనలు.. షాకైన పోలీసులు..
కరోనా వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వానిది ఒక దారి అయితే.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీది మరో దారి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాల ప్రజలు లాక్ డౌన్ పాటించాలని.. ఇళ్లకే పరిమితం కావాలని మోదీ సర్కార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీదీ మాత్రం రాష్ట్రంలో స్వీట్, పాన్, పూల మార్కెట్లన్నీ తెరవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఇలా అన్ని మార్కెట్లు తెరవాలని మమతా […]
కరోనా వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వానిది ఒక దారి అయితే.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీది మరో దారి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాల ప్రజలు లాక్ డౌన్ పాటించాలని.. ఇళ్లకే పరిమితం కావాలని మోదీ సర్కార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే దీదీ మాత్రం రాష్ట్రంలో స్వీట్, పాన్, పూల మార్కెట్లన్నీ తెరవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఇలా అన్ని మార్కెట్లు తెరవాలని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయానికి విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు జనాలు ఎక్కువగా గుమిగూడే విద్యా సంస్థలు, షాపులు, సినిమా థియేటర్లు, ఆలయాలు, ప్రార్ధనా మందిరాలను దీదీ సర్కార్ మూసివేసింది. కానీ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఓ మసీద్లో ఏకంగా 100 మంది ప్రార్ధనలు చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశం చేరుకున్నారు. మసీద్లో వంద మందికి పైగా ఉన్న జనాలను చూసి షాకయ్యారు. అందరినీ వెంటనే అక్కడ నుంచి పంపించేసి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టారు. కాగా, పశ్చిమ బెంగాల్లో 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు.
ఇది చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా మాస్కులు పంపిణీ..