కర్ణాటకలో కరోనా కలకలం.. రాయ్చూర్లో వారం రోజులు లాక్డౌన్!
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలోకర్ణాటకలో సోమవారం ఒక్కరోజే 2,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాలో
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలోకర్ణాటకలో సోమవారం ఒక్కరోజే 2,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జూలై 15 నుంచి 22 వరకూ రాయ్చూర్ నగరంతో పాటు, సింథనూర్ తాలూకాలో కూడా లాక్డౌన్ విధిస్తున్నట్లు రాయ్చూర్ డిప్యూటీ కమిషనర్ ఆర్ వెంకటేష్ కుమార్ ప్రకటించారు.
కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాయ్చూర్ జిల్లాలో సోమవారం 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 763కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 280. జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
[svt-event date=”13/07/2020,11:53PM” class=”svt-cd-green” ]
Lockdown to remain imposed in Raichur city and Sindhanur taluk of Raichur district from 15th July to 22nd July in the wake of #COVID19 pandemic: R Venkatesh Kumar, Deputy Commissioner, Raichur #Karnataka
— ANI (@ANI) July 13, 2020
[/svt-event]